విద్యార్థినీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

నవతెలంగాణ – చండూరు  
మండలంలోని బంగారుగడ్డ గ్రామంలోని  పాండురంగారావు ఫౌండేషన్ ద్వారా  పదవి తరగతి   తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మర్రిగూడ మండలానికి చెందిన ఆ సంస్థ ఫౌండేషన్ అధ్యక్షులు  పాండురంగారావు, కస్తల వెంకన్న  ‌ఎస్ఎస్ సీ స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రధానోపాధ్యాయులు  సీహెచ్ రామలింగయ్య   మాట్లాడుతూ, స్టడీ మెటీరియల్ అందించడం చాలా సంతోషకరమని, ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగించుకొని విద్యార్థినీ విద్యార్థులు పదవ తరగతికి పరీక్షలకు బాగా సన్నధ్ధం కావాలని, ఈ స్టడీ మెటీరియల్ ను ఉపయోగించుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ స్టడీ మెటీరియల్ అందించిన ఫౌండేషన్ అధ్యక్షులు  సభ్యులు పాండురంగారావు, వెంకన్నను  పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు , జీనత్ సాజిదా , నేతకాని నరేష్ , ఆశ్రిత  పాల్గొన్నారు.
Spread the love