10వేల విద్యా సంస్థలకు రుణాల జారీ లక్ష్యం : ఆక్సిలో ఫిన్‌సర్వ్‌

హైదరాబాద్‌ : వచ్చే 2028 నాటికి దేశంలో 10,000 పాఠశాలలు, విద్యా సంస్థలకు రుణ నిధులు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆక్సిలో ఫిన్‌సర్వ్‌ పేర్కొంది. విద్యా సంస్థలు తమ సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ, అధిక ఖర్చుతో కూడిన అప్పుల భర్తీకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి నిధులు అందించనున్నట్లు పేర్కొంది. ‘మేము మార్చి 2018లో విద్యా సంస్థలకు నిధులను అందించడం ప్రారంభించాము. కరోనా తర్వాత సాధారణ స్థితికి పరిస్థితులు రావడంతో, మేము ఇప్పుడు ఈ విభాగాన్ని దూకుడుగా ముందుకు కొనసాగి స్తున్నాము…” అని ఆక్సిలో ఫిన్‌ సర్వ్‌ ఎండి, సీఈఓ నీరజ్‌ సక్సేనా పేర్కొన్నారు.

Spread the love