నవతెలంగాణ – హైదరాబాద్: కొవిడ్ సమయంలో రద్దయిన ముంబై- విజయవాడ విమాన సర్వీసులను జూన్ 15 నుంచి పున:ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. రోజూ మ.3.55కు ముంబై నుంచి బయలుదేరి సా.5.45కు గన్నవరానికి విమానం చేరుకుంటుందని తెలిపింది. అలాగే ఇక్కడి నుంచి రా.7.10కి బయలుదేరి రా.9 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందని పేర్కొంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.