ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: అయ్యప్ప శ్రీనివాస్..

నవతెలంగాణ – ఆర్మూర్ 

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తారని మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు ,స్కూల్ యూనిఫామ్స్ అందజేస్తున్నారని, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు లిక్కి శంకర్, జహీర్ అలీ, తార, వడ్ల బుచ్చన్న ,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Spread the love