నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదు అయిన పోక్సో కేసుపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఈ మేరకు రాష్ట్ర డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసులో పక్షపాత ధోరణి లేకుండా విచారణ చేయాలని.. బాధితులకు న్యాయం జరగాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ సిటీలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబం కంప్లయింట్ చేసింది. మే 8వ తేదీన కంప్లయింట్ చేస్తే.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ పర్యటన, భద్రతా ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉండటంతో ఆలస్యం అయినట్లు వెల్లడించారు డీజీపీ.



