మండలంలో 25మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు..

నవతెలంగాణ -డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 25 మంది అధ్యాపకులకు మంగళవారం మాజీ రాష్ట్రపతి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ అధ్యాపకుల అవార్డులను అందజేశారు. ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రా మంలోని రైతు వేదికలో ఉత్తమ అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు ప్రశంస పత్రం, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల నోడల్ అధికారిని సంధ్య నాయక్, విశిష్ట అతిథిగా మన ఊరు మనబడి అధికారిని వీరలక్ష్మిలు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏటా అద్యపకులకు ఈరోజు సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని రంగాలలో ముందు ఉంచడమే ఉపాధ్యాయుల ధ్యేయమని దానిలో భాగంగానే ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్యాపకులను ఏరి కోరి ఈ అవార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి భార్గవ్, బీసీటీయు మండల అధ్యక్షులు గంగ మోహన్, తపాస్ మండల అధ్యక్షులు గంగ ప్రసాద్, యూటీఎఫ్ మండల అధ్యక్షులు పవన్ కుమార్, తో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Spread the love