కిషన్ రెడ్డిని కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి

నవతెలంగాణ – సిద్దిపేట

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి  హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  కిషన్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన తర్వాత  తొలిసారి కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహారెడ్డి, మల్లమ్మ గారి శ్రీనివాస్ రెడ్డి, బెదురు కుమారస్వామి, పిట్ల పరుశరాములు, బుగ్గ రాజేషం, తొడుపునూరి వెంకటేశం,గోనె మార్కండేయులు,రమేష్ గౌడ్, రామచంద్రం, నవీన్ రెడ్డి,హేమంత్, ఆకారం రమేష్, లతా రెడ్డి, మల్యాల శ్రీనివాస్, అచ్యుత్, సురేష్, బాబు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love