బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “మార్పు”కథల పుస్తకావిష్కరణ

నవతెలంగాణ – ఏర్గట్ల
ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని,ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో,తడపాకల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నూకల వైష్ణవి రచించిన “మార్పు”అనే కథల పుస్తకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావీద్ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు.ఈ సందర్భంగా తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ.. మంచి సందేశంతో కూడిన 21 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయని అన్నారు. చిన్న వయసులో సాహిత్యంపై మక్కువ పెంచుకుని,కథలు రాసిన నూకల వైష్ణవిని పలువురు అభినందించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్,గంగాధర్, కృష్ణ ప్రసాద్, రాములు,నరేంధర్,నాగప్ప,స్వప్న, సుజాత,విజయ,పాల్గొన్నారు.
Spread the love