రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే

నవతెలంగాణ- నకిరేకల్ : ఈనెల 30న జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, మునిసిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మురారి శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, పట్టణ అధ్యక్షుడు ఎల్లపురెడ్డి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love