నవతెలంగాణ – వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది. శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్సీ సారయ్యతో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి కొంతసేపు ఏకాంతంగా మాట్లాడారు. సారయ్యతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీల చేరికలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది.