బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు సమక్షంలో చేరిక

నవతెలంగాణ- మద్నూర్: మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కొండా వార్ రాజు, ఈరన్న, ధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం నాడు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక కార్యక్రమం జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం బీఆర్‌ఎస్‌టీ ప్రస్తుత అభ్యర్థి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సింగ్ పనితీరు నచ్చకనే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌  ముఖ్య నాయకులు పెద్ద తడగూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ నాగనాథ్ ఆ గ్రామ పెద్దలు గంగాధర్ పటేల్ 50 మంది వరకు యువకులు కాంగ్రెస్లో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో మద్నూర్ మండల మాజీ జెడ్పిటిసి సభ్యులు జి సాహెబ్రావ్ వ్యాపారవేత్త పప్పు సెట్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love