కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

– బాధిత కుటుంబాలకు చెక్కుల అందజేత
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
వివిధ సందర్భాల్లో ప్రమాదవశాత్తూ మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ సభ్యుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం కలిగి మృతి చెందిన కుటుంబాలకు రూ .2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ అందజేశారు. కోహెడ మండలం గుండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మద్దెల లక్ష్మణ్ మృతి చెందగా వారి సతీమణి లావణ్య పార్టీ ఇన్సూరెన్స్ రూ 2 లక్షల విలువ గల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్సు సౌకర్యం కల్పిస్తోందని అన్నారు.

Spread the love