నీట్‌ పరీక్షను రద్దు చేయాలి: బీఆర్‌ఎస్వీ

నవతెలంగాణ – హైదరాబాద్‌: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీట్‌ పరీక్షలపై కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love