అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సీడీపీఓ జానకి

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాన్ని సీడీపీఓ జానకి సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఎత్తు బరువులను కొలిసి వారికి పోస్ట్ కారాన్ని అందించాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. చిన్నారుల సర్వే యాప్ లపై అవగాహన కల్పించారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. పోషణ యాకర్ యాపుల్లో 100% పూర్తి చేసన అంగన్వాడి కార్యకర్తలను గుర్తించి వారికి సన్మానం జరిపారు. అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన కార్యకర్త పూజ, నీల అంగన్వాడి కార్యకర్త రాజ్యశ్రీ, కందకుర్తి అంగన్వాడి ఆయా జయశీల లకు సన్మానం జరిపారు. అనంతరం మార్చి 3 నుంచి నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ వినయ్ కుమార్ వైద్య సిబ్బంది కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, ఆరోగ్య విసిన్ అధికారి రవీందర్, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love