ఈనెల 16న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

– దాసరి పాండు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 16న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని దాసరి పాండు అన్నారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్మికుల ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఆఫీసులో డీపీకి సమ్మె నోటీసు అందజేశారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యవసర ధరలు పెంచి అనేక భారాలు మోపి, కార్మికుల 44చట్టాలను మార్చి నాలుగు కోడులు విభజించి, కార్మికులకు  అన్యాయం  చేశారన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు అనేక పోరాటాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకని దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధమవుతున్నారు. అంతలోపు మార్చకపోతే పోరాటాలని ఉద్ధృతం చేస్తామని అధ్యక్షులు దాసరి పాండు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ మండల కన్వీనర్ రెడ్డబోయిన ఐలయ్య పాల్గొన్నారు.
Spread the love