నవతెలంగాణ -ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకావడం లేదని ఫిర్యాదు చేసింది. విచారణను కోర్టు ఫిబ్రవరి 7 కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఐదోసారి ఈడీ నోటీసులిచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి2న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులిచ్చింది. అయితే కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం చట్టవ్యతిరేకమని..ఆయనను అరెస్ట్ చేసేందుకు ఈడీ అదేపనిగా నోటీసులు పంపుతోందని ఆప్ విమర్శిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించింది.