నవతెలంగాణ – ఢిల్లీ: కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శ్యామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన రాజీనామాను ఆమోదించారు. పిట్రోడా వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మోడీ సహా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.