నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని తెలిపారు. ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్లో చేరతారని కోమటిరెడ్డి జోష్యం చెప్పారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారన్నారు. డీలిమిటేషన్తో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 154కి చేరుతుందని.. అందులో 125 చోట్ల కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి తెలిపారు.