తుడుందెబ్బ ములుగు జిల్లా కార్యదర్శిగా గౌరబోయిన మోహన్ రావు

నవతెలంగాణ -తాడ్వాయి
తుడుం దెబ్బ ములుగు జిల్లా కార్యదర్శిగా మండలంలోని గంగారం గ్రామానికి చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ గౌరబోయిన మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా తురుము దెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ ములుగు జిల్లా అధ్యక్షుడు కూర గట్ల లక్ష్మణరావు వారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన తుడుందెబ్బ ములుగు జిల్లా కార్యదర్శి గౌరబోయిన మోహన్ రావు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ములుగు జిల్లా తుడుం దెబ్బ కార్యదర్శిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క ఆదివాసి కి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీలో ఆదివాసి చట్టాలు, ఆవాసులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల. జగన్నాధ రావు, ఉపాధ్యక్షులు పొడెం నాగేష్, వంక నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love