సూర్యాపేట మాయావతి సభకు తరలి వెళ్లిన చౌటుప్పల్ మండల నాయకులు

నవతెలంగాణ-చౌటుప్పల్ : సూర్యాపేటలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి బహిరంగ సభకు చౌటుప్పల్ మండలం నుండి బీఎస్పీ నాయకులు బుధవారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల బీఎస్పీ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ తెలంగాణలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బహుజన రాజ్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ బీఎస్పీ సీనియర్ నాయకులు మస్కు నరసింహ, కత్తుల పరమేష్, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షులు సుక్క లింగస్వామి, చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షులు మాదా రమేష్, వెంకటేష్, రజాక్, నితీష్, మహేష్, క్రాంతి సోమేశ్, నరసింహ, నాగరాజు, శంకర్, నవీన్ తదితరులు సూర్యాపేట బహిరంగ సభకు వెళ్లిన వారిలో ఉన్నారు.

Spread the love