చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలి: ఐసీడీఎస్ మాధవీలత

నవతెలంగాణ – రాయపర్తి
తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవిలత సూచించారు. గురువారం మండలంలోని మొరిపిరాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె చిన్నారులతో అక్షరభ్యాసం చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు సమతుల్య, నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు నాణ్యమైన విద్యను కూడా అందించడం జరుగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో రెండున్నరేళ్ల లోపు ఉన్న పిల్లలకు సామూహిక అక్షరభ్యాసం నిర్వహించడం మంచి పరిణామమని ఆమె పేర్కొన్నారు. చిన్నారులతోపాటు బాలింతలు, గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాలను, మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వర్, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love