సి ఐ శంకర్ ములుగు కు బదిలీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
పసర పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలికలుగా సిఐగా విధులు నిర్వర్తించిన వి శంకర్ శనివారం ములుగు సిఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు వెలుపడ్డాయి. దీర్ఘకాలికంగా 2021 నుండి ఇక్కడ సీఐగా పనిచేసిన శంకర్ మండల ప్రజల అభిమానాన్ని ఎంతగానో చురగొన్నారు. సౌమ్యుడిగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో శంకర్ తనదైన శైలిలో పరిష్కరిస్తూ మండల వ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. పసర పోలీస్ స్టేషన్ చరిత్రలో ఇంత దీర్ఘకాలికంగా పనిచేసిన సిఐ ఎవరూ లేరని కొందరు తెలుపుతున్నారు. మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుందని సీఐ శంకర్ ముందు ముందు భవిష్యత్తులో డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో పదోన్నతులు సాధిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలు తెలిపారు

Spread the love