అటవీ భూమి కొరకు రెండు గ్రామాల మధ్య ఘర్షణ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని సోమారం తాండ, కొత్తబాది గ్రామాల మధ్య అటవీ భూమి కొరకు ఆదివారం రెండు గ్రామాల ప్రజలు గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. కొత్తబాది గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్లతో వచ్చి ఫారెస్ట్ భూమిని అక్రమించుకొని దున్నారు. ఇది గమనించిన సోమారం తండా వ్యక్తి ఈ భూమిని తనకు ప్రభుత్వం ఇచ్చిందని అక్కడు ఎందుకు దున్నుతున్నారని ప్రశ్నించడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు. మీరు గ్రామాల మధ్య జరిగిన గొడవలో రెండు గ్రామాల చెందిన రైతులకు గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Spread the love