వచ్చే నెల మూడు నుంచి పదో తరగతి పరీక్షలు

– పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వచ్చే నెల మూడు నుంచి నిర్వ హించనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శనివారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఈ నెల 24 నుంచి ఆన్‌ లైన్‌లో అందుబాటులో ఉంచటమే గాక, పాఠశాలలకు కూడా పంపుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారనీ, ఇందు కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.

Spread the love