భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఆరా.. అధికారులకు ఆదేశాలు

నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగి పోవడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో సీఎం మాట్లాడారు. సీఎస్ శాంతికుమారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో తక్షణమే తెలుసుకొని జిల్లాల కలెక్టర్, ఎస్పీలను అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వర్షం ఇలాగే కొనసాగితే సచివాలయంలో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది.

Spread the love