ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్..

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసులో తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 3రోజుల రిమాండ్ విధించింది.  అయితే విచారణకు మరో 14 రోజులు కావాలని సీబీఐ కోరడంతో జుడీషియల్ కస్టడీని జులై 12 వరకు కోర్టు పొడిగించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

Spread the love