Monday, August 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించబోనని, క్రమశిక్షణా సంఘమే దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

ఇటీవల వరంగల్ జిల్లా గీసుగొండలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన విమర్శలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీపీసీసీ క్రమశిక్షణా సంఘం, వివరణ కోరుతూ మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -