నవతెలంగాణ – మల్హర్ రావు
సీఎం సభను విజయవంతం చేయాలని మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి మలహల్ రావు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాళేశ్వరంలోని మెదిగడ్డ నస్తూర్ వెళ్లిలో సోమవారం నిర్వహించే సిఎం రేవంత్ రెడ్డి సభకు అధిక సంఖ్యలో నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాళ్లు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నేతృత్వంలో రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, రాజమొగిలి, కేశవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం సభను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



