మంతిని గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమం..

నవతెలంగాణ- ఆర్మూర్  

త్వరలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం జిల్లా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని మంథని గ్రామంలో  పోలీసు శాఖ తరపున కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినారు .ఆధారాలు చూపని 37 బైకులను సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగపరుచుకునే విధంగా ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ పోలీసు కవాతు సైతం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగదీష్ చందర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు, సబ్ డివిజన్లోని ఎస్సైలు ,,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
Spread the love