పేద ప్రజల వెంటే కాంగ్రెస్ ప్రభుత్వం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

నవతెలంగాణ – బొమ్మలరామరం
మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన యాదగిరికి గుండె చికిత్స నిమిత్తం ఎల్ ఓ సి రెండు లక్షల 50 వేల చెక్కును ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వెంట ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సుర్విబిక్షపతి, ఎంపీటీసీ హేమంత్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముడుగుల కుమార్, ఈశ్వర్, నాగిల్ల దశరథ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Spread the love