కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం

– హాజరైన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు
నవతెలంగాణ కంటేశ్వర్: నిజామాబాద్ లో ప్రగతి నగర్ మున్నురుకాపు సంఘంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హందన్, పీసీసీ  ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, ఆకుల లలిత, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, రత్నాకర్, డి.సంజయ్, జిల్లా నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Spread the love