నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

– బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్
నవతెలంగాణ – మిరుదొడ్డి
నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ చేయమని ఆ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం అక్బర్ పేట భూంపల్లి మండలం అక్బర్ పేటలో అభ్యర్థి నీలం మధు కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలతో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి నీలం మధును అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో నర్సింలు, దుబ్బరాజు, బాలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love