అకాల వర్షం …అన్నదాతకు నష్టం

నవతెలంగాణ – చందుర్తి
మండలంలోని పంతొమ్మిది గ్రామాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానికి కల్లాల లో ఆర బెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దాయినది.సనుగుల,రామారావు పల్లి,బండపల్లి,జోగాపూర్, చందుర్తి లో అధికంగా వర్షం కురువడం తో కల్లాల లో నీరు చేరి ధాన్యం తడిసింది.దీంతో రైతులు నీటిని తొలగించే పనిలో ఉన్నారు.ఇన్ని రోజులు ఆర బెట్టిన ధాన్యం వర్షానికి తడిసి పోవడంతో రైతులు ఆవేదన చెందారు.అధికారులు తడిసిన ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేయాలని కోరారు.దాదాపుగా యాభై వేల క్వింటాళ్ల వరకు అకాల వర్షానికి ధాన్యం తడిసినట్లుగా తెలుస్తుంది.

Spread the love