పాఠశాల అభివృద్ధికి చేయూత

నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 1993-94 సంవత్సరంలో  పదవి పూర్తి చేసిన బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఇటీవల గెత్తుగేదర్ పార్టీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా రూ.15,216 వేలు సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కోడిమ్యాల భాస్కర్, పైడాకుల సంపత్,రమేష్,బొంతల రాజు,కుంట సది,గర్రెపల్లి రమేష్,బూర్ల శ్రీను,పులిగంటి రామన్న,బండి రాజశేఖర్, వేముల సదానందం పాల్గొన్నారు.
Spread the love