నవతెలంగాణ-హైదరాబాద్: కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ. గోవిందన్ విమర్శలు గుప్పించారు. ఇంధన ధరలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్నా..సతీశీన్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని, కనీసం అసెంబ్లీలో ధరల పెంపు అంశంపై మాట్లాడలేదని తిరువనంతపురం మీడియా సమావేశంలో ఆయన ధ్వజమెత్తారు.
‘వీడీ. సతీశన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి, ఇంధన ధరలు నాలుగు సార్లు పెరిగాయి. అయినప్పటికీ, సతీశన్ మౌనంగానే ఉన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విధాన ప్రసంగంలో, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను పరిష్కరించడానికి కేంద్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. వంట గ్యాస్ ధరల పెంపు మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలలకు సైతం ఇబ్బందులను సృష్టించింది. హోటళ్లు రెస్టారెంట్లలో కూడా ధరలు పెరుగుతున్నాయి. ప్రైవేటు బస్సుల రంగం కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’ అని గోవిందన్ మాట్లాడారు.



