అత్యధిక ఆధిక్యం తో “రామ సహాయం” విజయం: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య.

నవతెలంగాణ – అశ్వారావుపేట

 సీపీఐ(ఎం), సీపీఐ లు బలపరిచిన ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్ధి రామ సహాయం రఘురామిరెడ్డి అత్యధిక ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించనున్నారు. అని  సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆశాభావం వ్యక్తం చేసారు. ఆయన సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ములకలపల్లి,అశ్వారావుపేట మండలాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు.ప్రజా పాలన మరిచిన టీఆర్ఎస్ కు,మతం,దైవం ముసుగులో రాజకీయం చేస్తున్న భాజపా కూ ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,మండల కార్యదర్శి బి.చిరంజీవి,మండల కమిటీ సభ్యులు తగరం జగన్నాధం, కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love