మామిడిపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం

– పలువురు గ్రామస్తులకు, పశువులకు తీవ్ర గాయాలు
– కుక్కల నుండి రక్షించాలని గ్రామస్తుల వేడుకోలు
నవతెలంగాణ – కొనరావుపేట
మండలంలోని మామిడిపల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. దీంతో గ్రామంలోని ఊరడి సాయిమల్లయ్య, జవ్వాజి  రాజయ్య, మారుపాక చంద్రయ్యతో పాటు లోకుర్తి మల్లయ్య, పండుగ లచ్చయ్య, తీపిరెడ్డి వేణురెడ్డి అనే రైతులకు చెందిన పశువులు, మేకలు కుక్క  దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. ఈక్రమంలో గమనించిన గ్రామస్తులు పలువురిని కుక్క బారినుండి రక్షించారు. వెంటనే గాయాలపాలైన గ్రామస్తులు  కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయించుకున్నారు. పశువులకు ప్రైవేటు వైద్యులు టీకాలు వేశారు. అలాగే ఊరడి సాయి – మల్లయ్య అనే వృద్ధుడు ఇంటి సమీపంలో నిద్రస్తున్న సమయంలో తల భాగంలో కుక్క తీవ్రగాయపరచగ కోనరావుపేట పీహెచ్సీ నుండి సిరిసిల్ల ఏరియా దవాఖన తరలించారు. అనంతరం గ్రామస్తులు కుక్కను వెంబడించి చంపివేశారు. గ్రామంలో కుక్కల దాడి ఎక్కువవుతుందని వాటి నుండి రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Spread the love