గూర్గావ్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ ఇండియా కొత్తగా క్రిస్టల్ 4కె డైనమిక్ టివిని ఆవిష్కరించినట్లు తెలిపింది. దీని ప్రారంభ ధరను రూ.41,990గా నిర్ణయించింది. ఇది డైనమిక్ క్రిస్టల్ కలర్, ఎయిర్ స్లిమ్ డిజైన్, మల్టీ వాయిస్ అసిస్టెంట్, క్రిస్టల్ ప్రాసెసర్ 4కె, నాక్స్ సెక్యూరిటీ తదితర ఫీచర్లను కలిగి ఉందని ఆ సంస్థ వెల్లడించింది.