నవతెలంగాణ-గోవిందరావుపేట
నేతకాని కులస్తులందరికీ దళిత బంధు ఇచ్చి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని నేతకాని కుల మండల అధ్యక్షులు గాంధర్ల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో నేతకాని కులస్తుల సంఘం సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రమేష్ హాజరై మాట్లాడారు. మండలం లో ఎన్నో యేండ్ల నుండి నివసిస్తున్న ”నేతకానీ ” కులస్తులందరికి దళితబందు పథకాన్ని వర్తింప చేయాలని, నేతకానీలు లక్ష్మిపూర్, పస్రా, రాఘవపట్నం లో 150 కుటుంబాల వారు యేండ్ల తరబడి కూలీ పనులు చేసుకొంటూ పేదరికంతో అరకొర దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు అటువంటి వారికీ మొక్కుబడీగా 5 మందికి దళితబందు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో నివసిస్తున్న నేతకానీ కులస్తులకు అందరికి దళితబందు ను మంజూరు చేయాలనీ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం దోహదపడాలని అన్నారు. ఈ సమావేశంలో గ్రామపెద్దలు జాడి హన్మయ్య, జీడీ దామోదర్ నేతకానీ కులస్తులు పాల్గొన్నారు.