దళిత నాయకులపై బీజేపీ నాయకుల రౌడీయిజం సిగ్గుచేటు: దారస్వామి 

నవతెలంగాణ – మిరుదొడ్డి
దళిత నాయకులపై బిజెపి నాయకులు రౌడీయిజం చేయడం సిగ్గుచేటని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు లింగం, చార్వాక కుమార్, మాజీ ఎంపీటీసీ దారస్వామి  అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మిరుదొడ్డి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రోడ్డుపై దుమ్ము లేవకుండా నీటిని పడుతున్న ఎంపీటీసీ భర్త మల్లయ్య పై బిజెపి నాయకులు దురుసుగా మాట్లాడటంతో పాటు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దళితులపై దాడి చేసిన బిజెపి నాయకుడు రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, స్వామి, మాజీ సర్పంచ్ రాములు, తోట కమలాకర్ రెడ్డి గొల్ల రాములు, రాజ మహేందర్ రెడ్డి  పలువురు పాల్గొన్నారు.
Spread the love