విద్య కోసం మహీంద్రా సారథి అభియాన్ స్కాలర్‌షిప్ పొందనున్న ట్రక్ డ్రైవర్ల కుమార్తెలు

– 2014లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి8928 ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు స్కాలర్‌షిప్‌లు అందించబడ్డాయి
–  రూ.10,000/-విలువైన 1100 కొత్త స్కాలర్‌షిప్‌లు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించటంతో పాటుగా ఆర్ధిక సంవత్సరం 2024లో తదుపరి విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన దరఖాస్తుదారులకు (ట్రక్ డ్రైవర్ యొక్క కుమార్తెలు) ఇవ్వబడతాయి. 

పూణె: ఈ డ్రైవర్స్ దినోత్సవాన, మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్, ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు మహీంద్రా సారథి అభియాన్ ద్వారా స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేయనుంది. ప్రాజెక్ట్ మహీంద్రా సారథి అభియాన్ ఉన్నత విద్య కోసం వారి హక్కుకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ బాలికల జీవితాలను మార్చడానికి చిన్న సహకారం అందించడానికి కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమంకు మార్గదర్శకత్వం వహించిన మొదటి వాణిజ్య వాహన తయారీదారులలో ఒకటి మహీంద్రా మరియు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- స్కాలర్‌షిప్‌తో పాటు వారి విజయానికి గుర్తింపుగా ధృవీకరణ పత్రంతో సత్కరిస్తుంది. 2014లో మహీంద్రా సారథి అభియాన్‌తో ప్రారంభించబడిన ట్రక్ డ్రైవర్ కమ్యూనిటీకి మహీంద్రా ట్రక్ మరియు బస్ డివిజన్ యొక్క కొనసాగుతున్న నిబద్ధతలో ఈ ప్రయత్నం మరొక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశంలోని 75+ రవాణా కేంద్రాలలో రీచ్ అవుట్ ప్రోగ్రామ్ ద్వారా  పారదర్శక మరియు స్వతంత్ర ప్రక్రియ తో దీనిని నిర్వహిస్తున్నారు.  ఇప్పటి వరకు, 8928 మంది యువతులు తమ ఆశయాలను కొనసాగించేందుకు వీలుగా ఈ కార్యక్రమం ద్వారా  పొందిన స్కాలర్‌షిప్‌ల నుండి ఇప్పటికే ప్రయోజనం పొందారు. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ హెడ్ శ్రీ జలజ్ గుప్తా మాట్లాడుతూ, “మహీంద్రా సారథి అభియాన్ కమర్షియల్ వెహికల్ ఎకోసిస్టమ్‌లో మహిళలకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉంది మరియు డ్రైవర్ కమ్యూనిటీ జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉంది. ఈ ప్రోగ్రామ్‌తో ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు పెద్ద కలలు కనే అవకాశాన్ని అందించడం మరియు వారి కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి వారికి అవసరమైన మద్దతును అందించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. మహీంద్రా సారథి అభియాన్‌ను మా డ్రైవర్లు మరియు భాగస్వాములు హృదయపూర్వకంగా స్వీకరించారు, యువతులు తమ కలలను సాధించుకునేలా చేయడంలో దాని ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నారు…” అని అన్నారు. ఈ స్కాలర్‌షిప్ కోసం ఎంపికైన ప్రతి అమ్మాయికి INR 10,000 నేరుగా బ్యాంక్ కు బదిలీ చేయటం తో పాటుగా ఈ విజయానికి గుర్తింపుగా ఒక సర్టిఫికేట్ ద్వారా సత్కరించాలని కంపెనీ ప్రణాళిక చేసింది. మహీంద్రా ట్రక్ మరియు బస్ లీడర్‌షిప్ ఇండియా ఎంపిక చేసిన ప్రదేశాలలో ఫిబ్రవరి-మార్చి 24న మధ్య కాలంలో ఈ సన్మానం నిర్వహించనుంది, ఇందులో ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు 1100 స్కాలర్‌షిప్‌లు అందజేయబడతాయి.

 

Spread the love