దాయం విక్రం రెడ్డిని పరామర్శించి సన్మానించిన ఎమ్మెల్యే మందుల సామెల్

నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దాయం విక్రమ్ రెడ్డిని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం కొందరు గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు.ముఖ్యంగా ఎస్సీ కొత్త కాలనీలో  32 కె.వి విద్యుత్తు లైను వెళుతుండడంతో అట్టి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ,ఎస్ఈ తో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్,గ్రామ శాఖ అధ్యక్షులు సగ్గం నరసయ్య, రేతినేని శ్రీనివాస్,పులిగుజ్జు యాకయ్య,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు తప్పెట్ల శంకర్,పులిగుజ్జ నరసయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగరాజు,యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి పట్టణ అధ్యక్షులు రాంబాబు ,మురుగుండ్ల వీరయ్య, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love