- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్లో సంభవించిన భారీ వరదలతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. నేపాల్ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు 903 మంది మృతి చెందారు. మరో 4,200 మందికి పైగా ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. భోటే కోశి ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. గల్లంతైన వారి కోసం భద్రతా బలగాలు, రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
- Advertisement -



