బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించండి: నెల్లికంటి సత్యం

నవతెలంగాణ – మునుగోడు

ఈనెల 13న తెలంగాణ వ్యాపితంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మునుగోడు సీపీఐ కార్యాలయంలో జరిగిన మునుగోడు నియోజకవర్గ సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బీజేపీ నిరుద్యోగం అవినీతి పరిష్కరించకుండా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తూ రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఆదానీ అంబానీలకు దేశ సంపదను దోచుపెడుతున్న కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని రాజ్యాంగాన్ని మార్చాలని ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందుతున్న రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర బీజేపీ పన్నుతున్నదని తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదని బీఆర్ఎస్ గత పది సంవత్సరాలుగా అధికారులు ఉండి నల్లగొండ జిల్లాకు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఎస్ఎల్బీసీ గాని డిండి ఎత్తిపోతల పథకం గాని పూర్తి చేయకుండా కాలయాపన చేసి ఇయాల ప్రజల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ను ఓడించాలని ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ఆర్ అంజచారి గురిజే రామచంద్రం జి గాలయ్య ఎం రామలింగం బి నరసింహ టి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శులు చాపల శీను ఎన్ సతీష్ భాస్కర్ పల్లె శేఖర్ రెడ్డి ఈ బుక్షం రెడ్డి రమేషు ఏఐవైఎఫ. జిల్లా అధ్యక్షుడు బి సురేష్ తదితరులు ఉన్నారు.
Spread the love