బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా లింగస్వామి

నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన మొగుదాల లింగస్వామి (శంభు) ను మునుగోడు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు పెంబళ్ల జానయ్య నియామక పత్రంలో అందజేశారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన  సంక్షేమ పథకాలను మండలంలోని ప్రతి గడపగడపకు తీసుకెళ్లి బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తమ నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర ఉపధ్యక్షులు  గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సన్న గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love