బీఆర్ఎస్ కు ఓటెయ్యం..

-దళిత బందు ఎంపికపై చీలాపూర్ దళితుల అందోళన 
-గ్రామ పంచాయతీ,ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన 
నవతెలంగాణ-బెజ్జంకి : దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికారులు గుట్టుచప్పుడుకాకుండా కొందరిని ఎంపిక చేసి అన్యాయం చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటెయ్యమని చీలాపూర్ దళిత సామాజిక ప్రజలు అగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం చీలాపూర్ గ్రామ పంచాయతీ,మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం అవరణం వద్ద  దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికారులు,అధికార పార్టీల నాయకులు గుట్టచప్పుడుకాకుండా వ్యవహరించిన తీరుపై దళిత సామాజిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.గ్రామ సర్పంచ్ రాగుల మొండయ్యను దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికపై వివరణ కోరడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాకుండా దాటవేసే దోరణి అవలంభిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.దళిత బందు పథకంలో అత్యధికంగా అన్యాయానికి గురవుతున్నది ఎక్కువ మంది నీరుపేద దళిత సామాజిక వర్గాల ప్రజలేనని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
Spread the love