ఓటమితో నాకౌట్‌కు..!

ఓటమితో నాకౌట్‌కు..!– 2-3తో భారత్‌పై చైనా గెలుపు
– ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్స్‌
షా ఆలమ్‌ (మలేషియా) : అమ్మాయిలు చైనాపై మెరుపు విజయంతో క్వార్టర్‌ ఫైనల్లో కాలుమోపగా.. అబ్బాయిలు చైనా చేతిలో ఓటమితో నాకౌట్‌ దశకు చేరుకున్నారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల, పురుషుల జట్లు క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మెన్స్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో భారత్‌ 2-3తో చైనా చేతిలో పరాజయం పాలైంది. హాంగ్‌కాంగ్‌పై 4-1 విజయంతో నాకౌట్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న భారత్‌ స్టార్‌ జోడి సాత్విక్‌, చిరాగ్‌లకు విశ్రాంతి ఇచ్చింది. ప్రణరు 6-21, 21-18, 21-19తో వెంగ్‌పై, 21-11, 21-16తో లాన్‌ షిపై లక్ష్యసేన్‌ గెలుపొందారు. అర్జున్‌, కపిల జోడి 15-21, 21-19, 19-21తో, ప్రృథ్వీ, రామకృష్ణమూర్తి జోడి 13-21, 9-21తో, చిరాగ్‌ సేన్‌ 15-21, 16-21తో నిరాశపరిచారు. మహిళల విభాగంలో టీమ్‌ ఇండియా నేడు క్వార్టర్‌ఫైనల్లో హాంగ్‌కాంగ్‌తో తలపడనుంది.

Spread the love