కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యం

– కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఒగ్గు దేవయ్య
– దామన్న గెలవాలని ప్రత్యేక పూజలు
నవతెలంగాణ- పెన్ పహాడ్: కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యమని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఒగ్గు దేవయ్య అన్నారు. మండలంలోని నాగులపహడ్ గ్రామంలోని త్రికూటేశ్వర ఆలయంలో కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకొని దామన్న భారీ మెజారిటీతో విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తు ఇందిరమ్మ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2500, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు రూ.500 బోనస్ కల్పిస్తూ అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250చ.గ. ఇంటి స్థలం,  యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత పథకం కింద రూ.4000 నెలవారి పెన్షన్, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఆడపడుచులకు వివాహ సమయంలో లక్ష రూపాయల ఇందిరమ్మ కానుక, తులం బంగారం లాంటి గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి దామన్నను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ కృష్ణారెడ్డి, బూరుగు వెంకటయ్య, బూరుగు భద్రయ్య, పేరపంగి కొండల్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love