- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిలో ఇంధన సరఫరా సవాళ్లను అధిగమించేందుకు భారత ప్రభుత్వం ఒమన్ నుంచి గుజరాత్ కు సహజవాయువును తరలించే ‘మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్వాటర్ పైప్లైన్ (MEIDP)’ ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోస్తోంది. గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లడంతో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం లేకుండా నిరంతరాయ ఇంధన సరఫరా కోసం ఈ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది.
- Advertisement -



