భారత షట్లర్లకు నిరాశ…

భారత షట్లర్లకు నిరాశ...– సింగపూర్‌ ఓపెన్‌
సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు నిరాశ తప్పలేదు. మంగళవారం జరిగిన అన్ని గేమ్‌లలోనూ భారత షట్లర్లు పరాజయాన్ని చవిచూశారు. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రాజ్‌వత్‌, మహిళల సింగిల్స్‌లో ఆకర్షీ కశ్యప్‌తోపాటు భారత స్టార్‌ షట్లర్ల జోడీ చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ కూడా తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. చిరాగ్‌-సాత్విక్‌ జంట 20-22, 18-21తో డెన్మార్క్‌ జోడీ వెస్టర్‌గార్డ్‌-లాడ్‌గార్డ్‌ చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూశారు. ఇక ఆకర్షీ కశ్యప్‌ 18-21, 20-22తో ఛోకీవాంగ్‌(థారులాండ్‌), ప్రియాన్షు 21-23, 19-21తో సింగపూర్‌కు చెందిన సి.వై.లీ చేతిలో పోరాడి ఓడాడు. ఇక మహిళల డబుల్స్‌లో ఆర్‌ పాండా-ఎస్‌ పాండా జంట 12-21, 21-12, 13-21తో చైనీస్‌ తైపీ జంట చేతిలో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సూర్య-అమృత జంట 8-21, 17-21తో సింగపూర్‌ జంట చేతిలో వరుససెట్లలో ఓడారు. ఇక మహిళల సింగిల్స్‌లో భారత సంచలనం పివి సింధు బుధవారం తొలిరౌండ్‌లో కాజెఫీల్డ్‌(డెన్మార్క్‌)తో తలపడనుంది.
కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, ప్రణరు రారు కూడా నేడు తొలిరౌండ్‌ గేమ్‌లు ఆడనున్నారు.

Spread the love